భారతదేశం, జూలై 7 -- ఆపద సమయం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కష్టకాలంలో విచక్షణతో వ్యవహరించి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిన వ్యక్తి మాత్రమే విజేతగా నిలుస్తాడు. ఆపదలో ధనం, కుటుంబం, ప్రాణం.. ఈ మూడింటిలో దేనిని ముందుగా కాపాడుకోవాలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు.

"ఆపదర్థే ధనం రక్షేత్" అని చాణక్యుడు హెచ్చరించారు. అంటే, భవిష్యత్తులో వచ్చే ఆపదలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ధనవంతులుగా ఉన్నప్పుడు కష్టాలు రావు కదా అని అశ్రద్ధ చేయకూడదు. లక్ష్మీదేవి చంచలమైనది, ఆమె ఒక్క చోట స్థిరంగా ఉండదు. ఎంతటి సంపద ఉన్నా, సమయం కలిసి రానప్పుడు అది కరిగిపోతుంది. కాబట్టి, అత్యవసర పరిస్థితుల కోసం తగినంత ధనాన్ని నిల్వ ఉంచుకోవడం తెలివైన వారి లక్షణం.

చాణక్య నీతి ప్రకారం, ఒకవేళ కుటుంబానికి లేదా ప్రియతములైన వా...