భారతదేశం, జూన్ 3 -- Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) థియేట్రికల్ విడుదలకు కౌంట్‌డౌన్ ముగింపునకు వచ్చింది. జూన్ 4న (గురువారం) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా అఖండ విజయం సాధించాలనే బలమైన సంకల్పంతో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు రోజు ఆయన విజయవాడలోనూ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం (జూన్ 3) ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా బుచ్చిబాబు సానా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యం...