భారతదేశం, ఆగస్టు 7 -- భారత రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పెను సంచలనాలు సృష్టించిన బోఫోర్స్ లంచాల వ్యవహారం చట్టపరంగా శాశ్వతంగా ముగిసిపోయింది! ఈ కేసులో సుప్రీంకోర్టులో మిగిలి ఉన్న ఏకైక అప్పీల్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది. దీనితో ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న అన్ని న్యాయ ప్రక్రియలకు అధికారికంగా ముగింపు పడినట్లయింది.

హిందూజా సోదరులతో పాటు స్వీడన్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ 'ఏబీ బోఫోర్స్'పై ఉన్న అన్ని నేరపూరిత అభియోగాలను కొట్టేస్తూ 2005లో దిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ అజయ్ కే అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా నిరాకరించింది.

విచారణ సందర్భంగా, ఈ కేసు...