భారతదేశం, ఫిబ్రవరి 16 -- హైదరాబాద్ వేదికగా 'బయో ఆసియా 2026' సదస్సు సన్నద్ధమవుతోంది. జీవశాస్త్రంలో వస్తున్న మార్పులు, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నిరంతర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా సదస్సులో కీలక చర్చలు నిర్వహించనున్నారు. హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ సమ్మేళనంగా బయో ఆసియా సదస్సుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి నిర్వహించబోయే సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటాయి. 2025లో నిర్వహించిన సదస్సుకు 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

2026 ఎడిషన్ సదస్సుకు సంబంధించి 'టెక్‌బయో అన్‌లీష్డ్‌: ఏఐ, ఆటోమేషన్‌- బయాలజీ రివల్యూషన్‌' అనే థీమ్‌తో దీన్ని నిర్వహించనున్నారు...