భారతదేశం, ఏప్రిల్ 26 -- Royal Enfield : ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాబోయే రోజుల్లో భారత మార్కెట్‌ను ఊపేసేందుకు సిద్ధమైంది! కేవలం ఒకటో రెండో మోడళ్లు కాకుండా, ఏకంగా 350సీసీ నుంచి 750సీసీ సామర్థ్యం గల ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి (ఈవీ) కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అడ్వెంచర్ ప్రియుల కోసం హిమాలయన్ 440 నుంచి క్లాసిక్ లవర్స్ కోసం బుల్లెట్ 650 వరకు సరికొత్త బైకుల లైనప్‌ను సిద్ధం చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా ప్రతి కేటగిరీలోనూ కొత్త ప్రయోగాలకు తెరలేపింది. ముఖ్యంగా బడ్జెట్ అడ్వెంచర్ బైకుల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు ఈ ప్లాన్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న హిమాలయన్ 450 ధర కొంత ఎక్కువ కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా హిమాలయన్ 440ను కంపెనీ తీసుకువస్...