భారతదేశం, ఫిబ్రవరి 27 -- సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించిన 'మైనే ప్యార్ కియా' చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి, రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న నటి భాగ్యశ్రీ. అయితే ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ లో అతని తల్లి క్యారెక్టర్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాల్లోని అనవసరమైన రొమాన్స్ పై ఆమె ఫైర్ అయ్యారు.

వెరైటీ ఇండియాకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో 90ల నాటి సినిమా, ప్రస్తుత చిత్రాలకు ఉన్న తేడాల గురించి భాగ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. "సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 1990లలో కుటుంబమంతా కలిసి సమయం గడపడానికి ఏకైక వినోదం, ఏకైక మార్గం సినిమా. ఈ రోజు కుటుంబాలు చిన్నవి అయిపోయాయి. ప్రజలు మరింత ఒంటరిగా మిగిలిపోతున్నారు. సృజనాత్మక కళలకు అనేక మాధ్యమాలు అందుబా...