భారతదేశం, జనవరి 12 -- కోల్ ఇండియా అనుబంధ సంస్థ 'భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్' (బీసీసీఎల్​) ఐపీఓ డే 2 సబ్​స్క్రిప్షన్​ కొనసాగుతోంది. బిడ్డింగ్ ప్రారంభమైన మొదటి రోజు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూపై విపరీతమైన ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత రహిత ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ) షేర్ల కోసం పోటీ పడ్డారు. మరి ఈ బీసీసీఎల్​ ఐపీఓ జీఎంపీ ఎంత ఉంది? ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా?

జనవరి 9న ప్రారంభమైన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్​ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ జనవరి 13, మంగళవారం వరకు కొనసాగుతుంది.

మొదటి రోజు సాయంత్రం సమయానికి ఈ ఐపీఓ 8.09 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 9.26 రెట్లు, ఎన్ఐఐ కోటా 16.39 రెట్లు బుక్ అవ్వడం విశేషం. మొత్తం 34.69 కోట్ల షేర్లకు గానూ ఏకంగా 280 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి.

ప్రస్తుతం గ్రే ...