భారతదేశం, జూలై 28 -- ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ సైబర్ దాడికి గురైందనే వార్తలు బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బ్యాంక్‌కు చెందిన ఖాతాదారులు, అంతర్గత నిర్వహణకు సంబంధించిన దాదాపు 1 టెరాబైట్ (1టీబీ) సెన్సిటివ్ డేటా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైందంటూ నివేదికలు బయటకు వచ్చాయి.

లీక్ అయినట్లు చెబుతున్న ఈ డేటా ఫైళ్లలో ఖాతాదారుల పేర్లు, సేవింగ్స్, కరెంట్ ఖాతాల వివరాలు, రుణాలు, నెట్ బ్యాంకింగ్ సమాచారం, ఎన్‌ఆర్‌ఐ, కార్పొరేట్ బ్యాంకింగ్ రికార్డులు, కస్టమర్ కేర్ ఫైళ్లతో పాటు శాఖలు, ఏటీఎంలకు సంబంధించిన అంతర్గత డేటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సాంపిల్ ఫైళ్లు కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు, 'క్యాష్‌లెస్ కన్స్యూమర్' వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ ప్రకారం, ఈ అంశ...