భారతదేశం, మే 28 -- Eid ul adha mubarak wishes : ఇస్లాం మతంలో అత్యంత పవిత్రంగా భావించే రెండు ప్రధాన పండుగల్లో 'ఈద్-ఉల్-అజ్హా' ఒకటి. దీనినే మనదేశంలో 'బక్రీద్' అని 'త్యాగాల పండుగ' అని పిలుస్తారు. మరొకటి రంజాన్ లేదా ఈద్-ఉల్-ఫితర్. వార్షిక పవిత్ర హజ్ యాత్ర ముగిసిన వెంటనే, ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ చివరి నెల అయిన 'ధు-అల్-హిజ్జా' 10వ రోజున చంద్రదర్శనం ఆధారంగా ఈ బక్రీద్​ని జరుపుకుంటారు. మే 28, 2026న దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో బక్రీద్ వెనుక ఉన్న విశిష్టథ, ఖుర్బానీ నియమాలు, ప్రత్యేక శుభాకాంక్షలు ఇక్కడ చూడండి..

ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం.. అల్లా ఒకసారి ప్రవక్త ఇబ్రహీంను పరీక్షించాలనుకున్నాడు. అందులో భాగంగా తన ప్రాణ సమానమైన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి (త్యాగం) ఇవ్వాలని ఆదేశించాడు. దేవుని ఆ...