భారతదేశం, జూన్ 20 -- అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వివాదంపై రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమించిన 44 మంది నగదు లెక్కింపు సిబ్బందే ప్రాథమికంగా ఈ ఘటనకు బాధ్యులని ఆయన స్పష్టం చేశారు. అయితే, పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఈ వివాదంలో ఎవరిని పడితే వారిని వేలెత్తి చూపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆలయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

రామ మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి వివాదం రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని నృపేంద్ర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పాత్రపై వస్తున్న ఆరోప...