భారతదేశం, మార్చి 1 -- మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ మతతత్వ పీఠాన్ని శాసించి, ఆ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ దిశగా నడిపించిన అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్​ ఖమేనీ.. అమెరికా- ఇజ్రాయెల్​ దాడిలో హతమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆదివారం తెల్లవారుజామున ధ్రువీకరించింది.

అంతేకాదు, శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్టు ఇరాన్​ మీడియా ప్రకటన చేసింది.

ఈ అధికారిక ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఖమేనీ హతమయ్యారని ఆయన వెల్లడించారు. శనివారం ఇరాన్ వ్యాప్తంగా ఉన్న సైనిక, అణు అనుబంధ కేంద్రాలే లక్ష్యంగా ఇరు దేశాల దళాలు భారీ దాడులు నిర్వహించాయి. గత కొన్ని నెల...