భారతదేశం, ఏప్రిల్ 13 -- Athiya Shetty: భారతీయ సంగీత ప్రపంచంలో ధృవతార, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్ 12న ఆమె కన్నుమూశారన్న వార్త తెలియగానే సినీ, రాజకీయ, సంగీత ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే ఈ విషాద సమయంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి చేసిన ఒక ;పొరపాటు కారణంగా తీవ్రంగా ట్రోల్స్ కు గురవుతుంది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆశా భోంస్లే (92), ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12) తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆమె మృతికి సంతాపం తెలుపుతూ అతియా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. కానీ అందులో ఆశా భోంస్లే చిత్రానికి బదులుగా, 2022 ఫిబ్రవరి 6న మరణించిన ఆమె పెద్దక్క లతా మంగేష్కర్ ఫోటోను పొరప...