భారతదేశం, మార్చి 9 -- ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయేమే అని ఓవైపు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, ఆవేదనలు కనిపిస్తుంటే.. మరోవైపు అదే ఏఐ ద్వారా బిలియనీర్లుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా ఏఐ వల్ల గతేడాది వందలాది మంది బిలియనీర్ల లిస్ట్​లో చేరిపోయారు. మరీ ముఖ్యంగా 365 రోజుల్లో, రోజుకు ఇద్దరు చొప్పున బిలియనీర్స్​ లిస్ట్​లో చేరాని ఓక నివేదిక వెల్లడించింది.

'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026' ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,020 మంది బిలియనీర్లలో 114 మంది నేరుగా ఏఐ రంగంతో ముడిపడి ఉన్నవారే. ఇందులో విశేషం ఏంటంటే, వీరిలో దాదాపు సగం మంది (46 మంది) ఈ ఏడాది కొత్తగా ఈ జాబితాలోకి చేరారు.

ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ రంగం ఎంతటి వేగంతో సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.

"హురున్ ...