భారతదేశం, ఆగస్టు 31 -- ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు వారికి మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఒక సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లకు బస్టాండ్‌కు వెళ్లే తిప్పలు తప్పిస్తూ, నేరుగా వారి ఇంటి వద్ద నుంచే ఆర్టీసీ బస్సు ఎక్కే వెసులుబాటును కల్పించబోతోంది.

సాధారణంగా సూపర్‌ లగ్జరీ, ఏసీ, స్లీపర్‌ వంటి అగ్రశ్రేణి (హైయ్యండ్) బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, నిర్ణీత సమయానికంటే ముందే లగేజీతో బస్టాండ్‌కు చేరుకోవడం ప్రయాణికులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా కుటుంబాలు, బంధువులు లేదా స్నేహితుల బృందాలు ప్రయాణిస్తున్నప్పుడు లగేజీతో సమయానికి బస్టాండ్‌కు రావడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.

ఈ సమస్యను గుర్తించిన ఆర్టీసీ అధికారు...