భారతదేశం, జూన్ 24 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 'ఆంధ్రా ప్రీమియర్ లీగ్' (APL) చివరి దశ మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. జూన్ 24 సాయంత్రం జరిగిన హోరాహోరీ పోరులో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

ఏపీఎల్ చివరి దశ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. టోర్నీ అధికారిక ట్రోఫీతో పాటు జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఒక అద్భుతమైన వేదిక. గ్రామీణ, పట్ట...