భారతదేశం, జూన్ 1 -- Anushka: పెళ్లి కాకముందు నుంచే టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రమం తప్పకుండా హాజరయ్యేది. స్టాండ్స్ నుంచి తన అప్పటి బాయ్‌ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేది. కానీ విరాట్ ఎప్పుడైనా సరిగ్గా ఆడకపోతే.. నెటిజన్లు అనుష్కను దారుణంగా ట్రోల్ చేసేవాళ్లు.

కోహ్లీ ఫెయిల్ అవ్వడానికి ఆమె 'అన్‌లక్కీ' అంటూ ముద్ర వేశారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంతో, అదే అనుష్కను విరాట్‌కు, ఆర్సీబీకి లక్కీ ఛార్మ్ అంటూ ఫ్యాన్స్ తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆదివారం (మే 31) సాయంత్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ దాదాపు వన్ సైడ్‌గానే సాగింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్‌ను ఆర్సీబీ చిత్తుగా ఓడించింది. ఛేజింగ్‌లో 3...