భారతదేశం, ఆగస్టు 12 -- Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్'తోపాటు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాన్ని బయటపెడుతూ నెటిజన్లకు షాక్ ఇచ్చింది. గత రెండేళ్లుగా తాను ఒక విషపూరితమైన రిలేషన్‌షిప్‌లో ఉంటూ దారుణమైన పరిస్థితులను అనుభవించానని, తీవ్రమైన శారీరక, మానసిక నరకయాతన చూశానని సంచలన విషయాలు వెల్లడించింది.

గత నెలలో అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో "మనశ్శాంతి దక్కాలంటే కొన్ని డెడ్ ఎండ్స్ దాటి ముందుకు వెళ్లాలి" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్ చూసి చాలామంది ఆమెకు బ్రేకప్ అయిందని, ఇప్పుడే కోలుకుంటోందని భావించారు.

అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని ధన్య వర్మ టాక్ షో 'ఐ యామ్' (I AM) ఇంటర్వ్యూలో అనుపమ బయటపెట్టింది. "ఆ పోస్ట్ ఏదో రాత్రికి ...