భారతదేశం, జూలై 14 -- Anna Rajan: 'జైలర్ 2' నటి, మాలీవుడ్ బ్యూటీ అన్నా రాజన్ తన మార్ఫింగ్ ఫోటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుంటానని సైబర్ క్రిమినల్స్‌ను హెచ్చరించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నట్లు అన్నా రాజన్ గుర్తించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ సదరు అకౌంట్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన ప్రైవసీకి భంగం కలిగించేలా ఇదంతా చేశారని ఆమె మండిపడ్డారు.

"నా ఇమేజ్‌ను కావాలనే చెరిపేయడానికి, నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కావాలని ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. నా గౌరవానికి ...