భారతదేశం, మార్చి 7 -- మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి అంబరాన్నంటింది. యంగ్ హీరో అల్లు శిరీష్, తన చిరకాల మిత్రురాలు నయనిక రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 6) రాత్రి హైదరాబాద్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

శిరీష్ వివాహానికి సంబంధించిన మొదటి ఫోటోను అతని బావ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "అల్లు శిరీష్, నయనిక తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు" అని చరణ్ ట్వీట్ చేశాడు.

ఈ ఫోటోలో శిరీష్, నయనిక ఐవరీ కలర్ దుస్తుల్లో మెరిసిపోతుండగా.. అయ్యప్ప మా...