భారతదేశం, ఏప్రిల్ 21 -- Allu Arjun: నేషనల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏ హీరోకైనా బాలీవుడ్ నుంచి పిలుపు రావడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ విషయంలోనూ గత కొద్దిరోజులుగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఇకపై ముంబైలోనే సెటిల్ కాబోతున్నారన్నది ఆ ప్రచారం సారాంశం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా.. అన్న ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. "బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం లేదా ఇతర పనుల మీద ఎక్కువగా ముంబై వెళ్లడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. అయితే పూర్తిగా హైదరాబాద్ వదిలేసి ముంబైకి వెళ్లిపోతారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అర్జున్ మనసు ఎప్పుడూ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. ...