భారతదేశం, ఏప్రిల్ 7 -- Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం తన తాజా మూవీ 'డెకాయిట్' (Dacoit) ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శేష్ తన సినీ ప్రయాణంలోని ఒక ఆసక్తికరమైన, బాధాకరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా ఎదిగిన శేష్.. ఒకప్పుడు నటన రాదనే విమర్శలతో సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసిక్ హిట్ 'చందమామ'లో నవదీప్ పోషించిన పాత్రకు మొదట అడివి శేష్‌నే ఎంపిక చేశారట.

"కృష్ణవంశీ గారి 'చందమామ' సినిమాలో నవదీప్ చేసిన రోల్ కోసం నన్ను మొదట తీసుకున్నారు. అప్పుడు ఆ సినిమా టైటిల్ 'మల్లెపువ్వు'. కొన్న...