భారతదేశం, ఏప్రిల్ 15 -- ఎండలు ముదరనే లేదు. అప్పుడే తాగునీటి సమస్యలు మెుదలయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితుల ఎలా ఉంటాయోనని జనాలు ఇప్పటికే భయపడుతున్నారు.

తాగునీటి వనరులు ఎండిపోతున్న నేపథ్యంలో గృహాలకు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రస్తుత నీటి ట్యాంకుల ప్రదేశాలలో బోర్‌వెల్స్ తవ్వడానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోవడంతో మున్సిపాలిటీలో నీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.

మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా కోసం నీటిని నిల్వ చేయడానికి, పంప్ హౌస్ సమీపంలోని లాండసాంగ్వి వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న పంప్ హౌస్ వ...