భారతదేశం, మే 15 -- ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. సూర్య సంక్రమణం ఏ నెలలో జరగదో ఆ నెలను అధిక మాసం అంటారు. చాంద్రమానానికి, సౌరమానానికి మధ్య ఉండే 11 రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది.

మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. జూన్ 16 తర్వాత నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అయితే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం, మల మాసం అని కూడా అంటారు. ఎందుకు అలా అంటారు? దాని వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఏడాదికి 12 నెలలు ఉంటాయి. సూర్య చంద్ర గమనాలను సమన్వయం చేసే క్రమంలో అదనపు నెలను అధిక మాసంగా పరిగణించడం జరుగుతుంది. శుభకార్యాలు వంటివి ఈ నెలలో చేయరు. కేవలం ఆధ్యాత్మిక సాధనకు ఈ నెల చాలా పవిత్రమైనది.

సూర్య గమనం లేని కారణంగా దీనిని మలినమైన...