భారతదేశం, జూలై 1 -- Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోకి ఉన్న సపరేట్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఆ సినిమాల్లో వెంకీ మార్క్ కామెడీ టైమింగ్ ఇప్పటికీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ డైరెక్టర్, హీరోగా కలిసి చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ ర...