భారతదేశం, సెప్టెంబర్ 16 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. భారతదేశంలో కొత్త ఎఫ్ సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో ఎఫ్31 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో+ 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్స్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అద్భుతమైన మన్నిక, పనితీరును అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్లకు మూడు ఐపీ రేటింగ్‌లు, ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సిరీస్ ప్రారంభ ధర కేవలం రూ. 22,999 నుంచి మొదలవుతుంది! ఈ ఫోన్లు శక్తివంతమైన పనితీరు, ఆకట్టుకునే కెమెరా, మన్నికైన నిర్మాణంతో వస్తుండటంతో కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఆప్షన్​గా నిలుస్తుంది. కొత్త ఒప్పో ఎఫ్ సిరీస్ మోడళ్ల పూర్తి వివరాలు కింద చూడండి..

ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో+ 5జీ మోడళ్లు వరుసగా 6.5 ఇంచ్​,...