భారతదేశం, ఆగస్టు 21 -- హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి, ముఖ్యంగా పౌర్ణమికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి రోజున భక్తులు భోళా శంకరుడిని అత్యంత నిష్టతో పూజిస్తారు. శివలింగానికి జలాభిషేకం చేసి విశేష పూజలు నిర్వహిస్తారు.

సరిగ్గా ఇదే పర్వదినాన అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ) వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది శ్రావణ పౌర్ణమిపై చంద్రగ్రహణం నీడ కమ్ముకోవడంతో ప్రజల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. గ్రహణ సమయాల్లో శుభకార్యాలు, పూజాదికాలు నిషేధమనే నిబంధన ఉండటంతో ఈ ఏడాది పండుగ జరుపుకోవచ్చా లేదా అనే గందరగోళం నెలకొంది.

జ్యోతిష్య లెక్కల ప్రకారం, శ్రావణ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడటం దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ పునరావృతం అవుతోంది. చివరిసారిగా 2008లో శ్రావణ మాసంలో అమా...