భారతదేశం, నవంబర్ 6 -- ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో తరుచుగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఓ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వీరంతా ఎండీఎంఏ, గంజాయి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసు బృందాలు మొదట ఆరాంఘర్ రోడ్ సమీపంలో మాదకద్రవ్యాల సరఫరాదారుల బృందాన్ని అడ్డగించాయి. విచారణ అనంతరం రాజేంద్రనగర్ లో ముగ్గురు వినియోగదారులను అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (రాజేంద్రనగర్ జోన్) యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఔషధాల విలువను ఇంకా వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, రాజమండ్రితో పాటు బెంగళూరుకు చెందిన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.