భారతదేశం, జూలై 29 -- ఢిల్లీలో కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌‌ను క‌లిసిన అనంత‌రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమ‌తి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి వేదికలుగా మారుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ప్రశ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవారిని కఠినంగా శిక్షించాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నద‌ని ముఖ్యమంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయ‌త్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్రాల పరిధిలోనే...