Hyderabad, జూన్ 23 -- రోజురోజుకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటూ ముందుకు రానున్న సినిమా "లోపలికి రా చెప్తా". మాస్ బంక్ మూవీస్ పతాకంపై వెంకట రాజేంద్ర నిర్మించిన తెలుగు హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'లోపలికి రా చెప్తా'. ఈ సినిమాలో కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

అలాగే, లక్ష్మీ గణేష్, కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'లోపలికి రా చెప్తా' చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

శనివారం (జూన్ 21) హైదరాబాద్‌లో లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచ...