భారతదేశం, మార్చి 28 -- కాంతార చాప్టర్ 1 సినిమాలో లీడ్ రోల్ చేసి, ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారాడు. తన కో స్టార్స్‌ను సోషల్ మీడియాలో అతను అన్‌ఫాలో చేయడమే ఈ రచ్చకు ముఖ్య కారణం. చివరికి మూవీలో హీరోయిన్ గా చేసిన రుక్మిణి వసంత్ ను కూడా అతడు అన్ ఫాలో కావడం విశేషం.

బెంగళూరు టైమ్స్ లాంటి మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే.. రిషబ్ శెట్టి తన కో స్టార్స్ అయిన రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన రిషబ్ ఫాలోయింగ్ లిస్ట్‌లో ఇప్పుడు వాళ్ల పేర్లు అస్సలు కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ల మధ్య ఏదో టెన్షన్ నడుస్తోందని, పెద్ద గొడవే జరిగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

సరిగ్గా ఇదే టైమ్‌లో కాంతార మేకర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ కం...