భారతదేశం, సెప్టెంబర్ 12 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్లు పెరిగి 81,549 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 324 పాయింట్లు వృద్ధిచెంది 25,005 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి 54,670 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3472.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,045.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ సెప్టెంబర్​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 9373.85 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,591.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ...