భారతదేశం, మే 22 -- పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్లిపోక తప్పదు. మన హిందూ ధర్మంలో పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి దశకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. గరుడ పురాణం ప్రకారం మనిషి అంత్యక్రియలకు సంబంధించి అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. ఎప్పుడైనా సరే శాస్త్రోత్తంగా కార్యక్రమాలు చేస్తేనే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలను ఎంతో నిష్టతో, నియమాలతో జరుపుతారు.

మరణం అనేది శరీరానికి మాత్రమే ఏర్పడుతుందని హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది, అమరమైనది. దహన సంస్కారాలే మనిషి పంచభూతాల్లో కలిసిపోవడానికి సరైన మార్గం. ఒకవేళ ఎవరైనా అంత్యక్రియలను విధివిధానాల ప్రకారం నిర్వహించకపోయినట్లయితే ఆ ఆత్మకు మోక్షం కలగదని, భూలోకంలోనే ఆ ఆత్మ సంచరిస్తుందని పండితులు చెబుతున్నారు....