భారతదేశం, ఆగస్టు 3 -- ఇండియాలో 2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు భారీ డిమాండ్​ ఉంది. దానిని క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తూనే, పోర్ట్​ఫోలియోలోని ప్రాడక్ట్స్​ని అప్​డేట్​ చేయడం, మెరుగైన రేంజ్​తో కూడిన ఈవీలను లాంచ్​ చేయడం వంటి వాటిపై ఫోకస్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏథర్ ఎనర్జీకి చెంది 450ఎస్​ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ ఇటీవలే బయటకు వచ్చింది. ఈ కొత్త మోడల్ రేంజ్​ ఎక్కువ. 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ అప్‌డేటెడ్ 450ఎస్​, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం 161 కి.మీ. రేంజ్​ని ఇస్తుంది. బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,45,999గా ఉన్న ఈ స్కూటర్, 450 ప్లాట్‌ఫామ్ స్పోర్టి లక్షణాలను కోరుకుంటూ, అదనపు రేంజ్ సౌలభ్యాన్ని ఆశించే రైడర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలను ఇ...