భారతదేశం, మే 13 -- వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. దీనికి 'అచల ఏకాదశి' అనే పేరు కూడా ఉంది. ఈ ఏడాది మే 13వ తేదీన అనగా ఈరోజు అపర ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఏకాదశి, ద్వాదశి తిథుల కలయిక ఉండటం వల్ల ఈ పర్వదినానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని పద్మపురాణం చెబుతోంది.

"రాజేంద్రా! లోక కళ్యాణం కోసం నువ్వు మంచి విషయం అడిగావు. వైశాఖ కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఇది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. బ్రహ్మహత్య, గోత్ర హత్య, పిండహత్య వంటి మహా పాపాలు చేసిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాప విముక్తులవుతారు," అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించారు.

కేవలం శారీరక పాపాలే కాకుండా.. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, తూకాల్లో మోసం ...