భారతదేశం, సెప్టెంబర్ 20 -- మన దేశంలో ఇళ్లు, దుకాణాలు లేదా వాహనాల ముందు నిమ్మకాయ, మిరపకాయలను వేలాడదీయడం సర్వసాధారణం. ముఖ్యంగా షాపుల మెయిన్ డోర్ వద్ద దారానికి గుచ్చిన ఐదు లేదా ఏడు పచ్చిమిర్చి మధ్యలో ఒక నిమ్మకాయ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని చూడగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది 'దిష్టి తగలకుండా' ఉండటమే. అయితే ఈ సాంప్రదాయం కేవలం దైవిక విశ్వాసానికే పరిమితం కాలేదని, దీని వెనుక కొన్ని ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

హిందూ సంప్రదాయంలో నిమ్మకాయ, మిర్చిని దుష్ట శక్తులు మరియు చెడు దృష్టి నుంచి రక్షించే కవచంగా భావిస్తారు. ఎవరి ఈర్ష్య లేదా ప్రతికూల దృష్టి ఇల్లు లేదా వ్యాపారంపై పడకుండా, అది ముందుగా ఈ నిమ్మ-మిర్చిపైనే ప్రభావం చూపుతుందని ప్రజల గట్టి నమ్మకం. అందుకే కొత్త వ్యాపారం మొదలుపెట్టినప్పుడు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసిన...