భారతదేశం, జూలై 30 -- హిందూ సనాతన ధర్మంలో దేవుణ్ని ఆరాధించడానికి పూజా విధానాలతో పాటు మంత్ర జపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా లయకారకుడైన మహాశివుడు ఎంతో దయగలవాడని, భక్తులు చూపించే స్వచ్ఛమైన ప్రేమకు, భావానికి త్వరగా కరిగిపోతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎలాంటి కఠినమైన పూజా విధానాలు లేకపోయినా, కేవలం శివనామ జపంతోనే ఆ స్వామి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు.

నిత్యం శివుడిని ఆరాధించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేకించి శివుడిని ఆరాధిస్తారు. భక్తులు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాక్ష మాలతో ప్రత్యేక జపాలు చేస్తుంటారు. అయితే, నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా మంత్రాలు జపించడం వల్ల సరైన ఫలితం దక్కదని ఆధ్యాత్మిక నిపుణులు స్పష్టం ...