భారతదేశం, ఫిబ్రవరి 5 -- టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ నెలకొన్ని కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పాడు. వి ఆర్ విత్ బంగ్లాదేశ్ అంటూ మాట్లాడాడు.

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఆడటంపైనే ఫస్ట్ డౌట్లు వచ్చాయి. కానీ టోర్నీలో ఆడతామని, ఇండియాతో మ్యాచ్ ను మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 15 న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ కు మైదానంలోకి దిగమని చెప్పింది. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ మాట్లాడారు.

''ఐసీసీకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఈ నిర్ణయం (ఇండియాతో...