భారతదేశం, జూలై 31 -- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2026 ఆగస్టు 1వ తేదీ నూతన అధ్యాయానికి నాంది పలకబోతున్నది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, భోగాపురంలో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఒక ప్రాంత ఆర్థిక రూపురేఖలనే పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సరిగ్గా అటువంటి ప్రాజెక్టే ! ఎందుకంటే, ఇది కేవలం విమానాలు ఆగే చోటు కాదు. ఇది వెనకబడిన ఉత్తరాంధ్రను ప్రగతి పథంలో ముందుకు నడిపించే ఒక పవర్ హౌస్. ఇది ఉత్తరాంధ్ర యువత ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతిరూపం.

మౌలిక వసతుల కల్పన అనేది ఏ ప్రాంత ఆర్థికాభివృద్ధికైనా పునాది లాంటిది. రోడ...