భారతదేశం, జూన్ 3 -- విశాఖపట్నంలోని పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(APPCB) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. జూన్ 5న జరగబోయే 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' (World Environment Day) పురస్కరించుకుని, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 4వ తేదీన విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని "ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం" (Inspired by Nature. For Climate. For Our Future) అనే ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడం, పర్యావరణ హితమైన స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.

మాధవధార హౌసింగ్ బోర్డు కాలనీలోని ఏపీపీసీబీ ప్రాంతీయ కార్యాలయంలో జూన్...