భారతదేశం, ఆగస్టు 1 -- మహాభారతంలో అత్యంత మేధావిగా, ధర్మమూర్తిగా మహాజ్ఞాని విదురుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'విదుర నీతి' కేవలం ఆ కాలానికే పరిమితం కాలేదు, నేటి డిజిటల్ యుగంలోనూ మనిషి జీవన విధానాన్ని మార్చగల శక్తి దానికి ఉంది. మనిషి జీవితంలో విజయం సాధించాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా మంచి స్నేహ సంబంధాలు చాలా అవసరం. అయితే, కొందరి సావాసం జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన 5 రకాల వ్యక్తుల గురించి విదురుడు ఎప్పుడో హెచ్చరించాడు. వారిని జీవితంలో దరిచేరనీయకపోవడమే మంచిదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యక్తులు ఎవరంటే...

ఎదుటేమో అతిగా పొగడటం, వెనుక మాత్రం మన గురించే చెడుగా మాట్లాడటం కొందరి నైజం. ఇలాంటి వ్యక్తులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విదుర నీతి చెబుతోంది. "ఎదుట ఒకలా, వెనుక మరోలా మాట్లాడేవారిని నమ్మితే జీవితంలో కోలు...