భారతదేశం, మే 27 -- విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు అలర్ట్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్డును మే 28వ తేదీ (గురువారం) నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వచ్చే 15 రోజుల పాటు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు. అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో భక్తులు ఇంద్రకీలాద్రి పైకి చే...