భారతదేశం, జూన్ 22 -- సమాజంలో మనం ఎదుగుదలకు ఆటంకంగా మారే నాలుగు ప్రధాన దుర్గుణాల గురించి విదుర నీతి స్పష్టంగా వివరించింది. కోపం, అతి సంతోషం, గర్వం మరియు చాపల్యం (పిరికితనం లేదా అతివినయం) అనేవి మనిషిని లక్ష్యానికి దూరం చేస్తాయి. వీటిని జయించిన వాడే నిజమైన మేధావి అని విదురుడు పేర్కొన్నాడు. "కోపం, అతి హర్షం, గర్వం, అశాంతి - ఇవే మనిషి పురుషార్థాన్ని దెబ్బతీస్తాయి. వీటిని వదిలేసిన వాడే పండితుడు" అని విదుర నీతిలోని శ్లోకం చెబుతోంది.

కోపం మనిషికి అతి పెద్ద శత్రువు. ఆవేశంలో ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ మరుగున పడిపోతుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. ఇది కేవలం బంధాలను మాత్రమే కాదు, వ్యక్తిగత ఆరోగ్యాన్ని, వృత్తిపరమైన ఎదుగుదలను సైతం దెబ్బతీస్తుంది. కోపాన్ని జయించిన వాడు ఏ సమస్యలోనైనా స్థితప్రజ్ఞతతో వ్యవహరించగలడు...