భారతదేశం, ఆగస్టు 19 -- ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. ఆరోజు వరాలు ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, కోరికలు నెరవేరుతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు అమ్మవారిని నియమ నిష్ఠలతో ఆరాధించాలి. అలాగే పూజా విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి.

చివరగా వ్రత కథ చదువుకోవాలి. ఇలా అమ్మవారిని సరిగ్గా విధానంలో ఆరాధించడం వలన వరాలు ఇచ్చే ఆ అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అలాగే అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈరోజు వరలక్ష్మీ వ్రత కథ గురించి తెలుసుకుందాం.

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఈ విధంగా చెప్పారు: "మునులారా! స్త్రీలకు సౌభాగ్యకరమైన వ్రతము ఒకటి ఉంది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. లోక ఉపకారం కోరి ఆ వ్రతాన్న...