భారతదేశం, ఫిబ్రవరి 16 -- గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. కారణం మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారు? అనే విషయంపై సందిగ్ధత ఉండేది. చివరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీనే మేయర్ పీఠంపై కూర్చుంది. నిజానికి కాంగ్రెస్ తీవ్రంగా ఈ స్థానం కోసం ప్రయత్నం చేసింది. కానీ లెక్కలు కుదరలేదు. దీంతో కాషాయ పార్టీకి లైన్ క్లియర్ అయింది.

34 మంది కార్పొరేటర్ల మద్దతుతో కాషాయ జెండా ఎగురవేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, వై.సునీల్ రావులను నిలబెట్టింది. వారే గెలిచినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. నిజానికి మేయర్ పీఠం దక్కించుకునేందుకు బండి సంజయ్ చేసిన వ్యూహాలు ఫలింతాయి....