భారతదేశం, జూన్ 22 -- Visakhapatnam Kirandul Passenger Train Updates : రైలు ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. కమ్లూర్ - భాన్సీ రైల్వే సెక్షన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనుల కోసం భారీ ట్రాఫిక్ బ్లాక్‌ను విధించారు. ఈ పనుల నిర్వహణ కారణంగా విశాఖపట్నం - కిరండూల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్ల సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు వెల్లడించింది. కొన్ని రైళ్లను గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం (షార్ట్ టెర్మినేట్), మరికొన్ని రైళ్లను మధ్యలోనే ప్రారంభించడం (షార్ట్ ఒరిజినేట్) చేస్తున్నట్లు పేర్కొంది.

రైల్వే లైన్ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ డబ్లింగ్ పనులు చేపట్టారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం...