భారతదేశం, ఆగస్టు 17 -- శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు మంగళ గౌరీ దేవి వ్రతం ఆచరించడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది. శ్రావణ మాసం అంతా శివనామస్మరణతో పాటు అమ్మవారి పూజలతో కళకళ్లాడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి విశేష స్థానం ఉంది.

ఆ రోజు భక్తులు, ముఖ్యంగా వివాహిత స్త్రీలు, మంగళ గౌరీ వ్రతం ఆచరించి, అష్టోత్తరాలతో పసుపు, కుంకుమలు సమర్పిస్తూ అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలగిపోయి ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి.

శ్రావణ మంగళవారం నాడు భక్తులతో మంగళ గౌరీ దేవిని ఆరాధించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. పెళ్లయిన కొత్తలో ఐదేళ్లపాటు ఈ వ్రతాన్ని ఆచరించడం అయితే, ఎవరైనా కుటుంబ శ్రేయస్సు కోసం, సంతాన సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తులతో చేయొచ్చు.

ఆ రోజు తెల...