భారతదేశం, జనవరి 4 -- 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రెండు తమిళ సినిమాలు ఢీ కొడుతున్నాయి. స్టార్ హీరో విజయ్ మూవీ 'జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు)', శివ కార్తికేయన్ చిత్రం 'పరాశక్తి' బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాయి. జనవరి 9న జన నాయగన్, జనవరి 10న పరాశక్తి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ రిలీజ్ డేట్ పై శివ కార్తికేయన్ షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారింది.

పరాశక్తిని మొదట 2025 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారని, కానీ అప్పుడు జన నాయగన్ తో క్లాష్ కాకుండా వాయిదా వేశామని శివ కార్తికేయన్ అన్నారు. దీంతో 2026 సంక్రాంతికి పరాశక్తి రిలీజ్ చేయాలని అనుకున్నారు. మరోవైపు జన నాగయన్ ప్రొడ్యూసర్లు కూడా వచ్చే సంక్రాంతిపైనే కన్నేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పరాశక్తి వర్సెస్ జన నాయగన్ క్లాష్ తప్పలేదు.

పరాశక్తి ఈవెంట్లో జన నాయగన్ రిలీజ్ డేట్, విజ...