భారతదేశం, ఆగస్టు 28 -- అన్నాచెల్లెళ్ల ఆప్యాయతలను చాటిచెప్పే శ్రావణ పౌర్ణమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే రోజున అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి, వారి జీవితాంతం రక్షణగా ఉండాలని కోరుకుంటారు. అయితే రాఖీ కట్టే సమయంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. రక్షాసూత్రానికి సరిగ్గా మూడు ముళ్లు మాత్రమే ఎందుకు వేయాలి? కేవలం ఆచారమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే విషయాలపై ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశషాలు ఉన్నాయి.

మన సనాతన ధర్మంలో ప్రతి సంప్రదాయం వెనుక ఒక స్పష్టమైన శాస్త్రం ఉంటుంది. రాఖీకి వేసే మూడు ముళ్లు కేవలం అలంకరణ కాదు, అవి సాక్షాత్తూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకలుగా పెద్దలు చెబుతారు. "త్రిదేవ రక్ష కుర్వన్తు సర్వతు" అనే వేద మంత్రం ఆధారంగా ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది. ఈ ...