భారతదేశం, ఆగస్టు 25 -- భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, సాంకేతిక సరఫరా వ్యవస్థలను మరింత భద్రపరచుకునేందుకు కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ కలసి అగ్రశ్రేణి భారతీయ పారిశ్రామికవేత్తలతో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ రాత్రి భోజన సమావేశంలో రక్షణ పరికరాల తయారీ, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, సమాచార సాంకేతిక రంగాలకు చెందిన ప్రతినిధులు, సీఈఓలు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో రెండు దేశాల వ్యూహాత్మక విధానాలను ప్రత్యక్ష వ్యాపార పెట్టుబడులుగా మార్చడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.

ఇర...