భారతదేశం, జూన్ 6 -- ఆధ్యాత్మిక పర్యటనలు చేయాలనుకునే భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. అత్యంత పవిత్రమైన యమునా నది పుష్కరాలను పురస్కరించుకుని కాకినాడ డిపో నుండి ప్రత్యేక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఈ ప్రత్యేక యాత్ర జూన్ 10, 2026న ఉదయం 11 గంటలకు కాకినాడ డిపో నుండి ప్రారంభం కానుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ యాత్రలో దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ ద్వారా కేవలం యమునా పుష్కరాలే కాకుండా, ఉత్తర, తూర్పు భారతదేశంలోని ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవచ్చు. సింహాచలం, భువనేశ్వర్, కోణార్క్, పూరి జగన్నాథ ఆలయం, అయోధ్య (శ్రీరామ జన్మభూమి), వారణాసి, ప్రయాగ్‌రాజ్, గయ, బుద్ధగయ, జాజ్‌పూర్, ఆగ్రా, బృందావన్...